ఆ మూవీ కోసం.. 10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్‌

77చూసినవారు
ఆ మూవీ కోసం.. 10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్‌
ధనుష్‌, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ముంబయిలోని అతిపెద్ద డంప్‌యార్డ్‌లో షూటింగ్‌ చేయాలని చిత్రబృందం నిర్ణయించిందట. ఇక ఆ సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్‌ 10 గంటల సేపు మాస్క్‌ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారని తెలిసింది. సినిమాలపై ఆయనకున్న నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇందులో ధనుష్‌ డీగ్లామరైజ్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్