పొత్తులో భాగంగా ఏపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఏపీ బీజేపీ సిద్ధం చేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. అయితే ఎవరెవరికి సీటు కేటాయించారనే విషయం ఉత్కంఠత వీడలేదు. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. రాజమండ్రి, అమలాపురం, రాజంపేట, తిరుపతి, అరకు, నరసాపురం, విజయనగరం స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.