మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు.