రూ. 200 కోట్ల లిక్కర్స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛత్తీస్గఢ్కి చెందిన మాజీ ఐఎఎస్అధికారిని అరెస్ట్ చేసింది. మాజీ ఐఎఎస్ అధికారి అనిల్ తుతేజా, ఆయన కుమారుడు యష్ తుతేజాలను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన చివరగా చత్తీస్గఢ్ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డారు.