ఇజ్రాయెల్ దాడిలో భారత మాజీ సైనికాధికారి మృతి

84చూసినవారు
ఇజ్రాయెల్ దాడిలో భారత మాజీ సైనికాధికారి మృతి
ఐక్యరాజ్యసమితి భద్రతా అధికారిగా పనిచేస్తున్న భారత మాజీ సైనికాధికారి సోమవారం దక్షిణ గాజాలో చనిపోయారు. రఫాలోని ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఐక్యరాజ్యసమితి జెండాలు ఉన్న వాహనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో కల్నల్ వైభవ్ అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఐక్యరాజ్య సమితి ధృవీకరించింది. ఈ దాడిలో మరొకరు కూడా గాయపడినట్లు తెలిపింది. కాలే 2022లో భారత సైన్యం నుంచి రిటైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్