మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ప్రవింద్పై కేసు నమోదు కావడంతో విచారణ చేపట్టిన పోలీసులు తనిఖీల్లో పలు ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. కాగా ప్రవింద్ జగన్నాథ్ 2017 నుంచి 2024 వరకు మారిషస్ ప్రధానిగా పని చేశారు.