పాకిస్థాన్
క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో భార్యాభర్తల విడాకుల ఉదంతాలు పెరిగిపోవడానికి మహిళలు ఎక్కువగా ఉద్యోగాల్లో చేరడమే కారణమని చెప్పారు. ఆర్థిక స్వతంత్రం కారణంగా ఇంట్లోని వారిని తామే పోషించాలని మహిళలు నిర్ణయించుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అన్వర్ను నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.