అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ISIS టెర్రరిస్టులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సోమవారం అరెస్టు చేసింది. వారంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు పేర్కొన్నారు. ఐపీఎల్లో కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్ల ముందు వీరు పట్టుబడ్డారు. దీంతో వారిని ప్రశ్నించేందుకు గుర్తు తెలియని ప్రాంతానికి పోలీసులు తరలించారు. ఈ ఘటన తర్వాత ఎయిర్పోర్టు అంతటా భద్రతను పెంచారు.