రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం అమోఘం. పల్నాటి పౌరషాన్ని ఢిల్లీ స్థాయిలో చూపించిన నేత ఆయన. ఆయనే కాసు బ్రహ్మానందరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో BHEL, IDPL, ECIL, BDL, హిందుస్థాన్ కేబుల్స్, విశాఖ ఉక్కు కర్మాగారం, తదితర 55 కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ ప్రాజెక్టులు ఆయన హయాంలో వచ్చినవే అంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం పారిశ్రామికంగా సుసంపన్నం కావడానికి దోహదపడిన ఆయన 30వ వర్ధంతి నేడు.