అమెరికాలోని హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి

68చూసినవారు
అమెరికాలోని హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్‌ పట్టణంలో అపలాచీ హైస్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్‌ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెలిసి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. విద్యార్థి వయసులో ఉన్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్