ఉత్తరప్రదేశ్‌లో చిన్నారులపై నక్కల దాడి.. 12 మందికి గాయాలు

80చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో చిన్నారులపై నక్కల దాడి.. 12 మందికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలో చిన్నారులపై నక్కలు దాడి చేశాయి. వాటిని గమనించిన కొందరు వృద్ధులు పిల్లలను రక్షించేందుకు వెళ్లగా వారిపైనా అవి దాడికి దిగాయి. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వాటిని వెంబడించి ఓ నక్కను చంపేశారు. గాయపడిన 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్