ఎన్నికల ముందు మహిళలకి ఫ్రీ బస్సు పథకానికి రయ్ రయ్ అని.. గెలిచాక నై నై అంటే ఎలా అంటూ చంద్రబాబుని ట్యాగ్ చేసి వైసీపీ శనివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. "అప్పుడేమో రాష్ట్రమంతా అని ఊదరగొట్టి.. ఇప్పుడు గెలిచాక జిల్లా వరకే ఫ్రీ అంటావా? ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్లండి.. కండక్టర్ టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి అని ఇప్పుడు గెలిచాక మాట మార్చేస్తావా?" అని వైసీపీ నిలదీసింది.