కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులిస్తున్నారు: బండి సంజయ్

72చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులిస్తున్నారు: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర సర్కారు నిధులు ఇవ్వట్లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో మాట్లాడుతూ.. 'కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు. మేం ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. MLAలు పార్టీ మారడం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. జనసేనతో కలిసి తెలంగాణలో ముందుకెళ్లడం అధిష్ఠానం చూసుకుంటుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్