మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో

2543చూసినవారు
బల్మూర్ మండల పరిధిలోని జినుకుంట గ్రామంలో తాగునీరు రావడం లేదని ఆ గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై బుధవారం రాస్తారోకో చేస్తున్నారు. నెల రోజుల నుండి త్రాగు నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట, మహబూబ్నగర్, శ్రీశైలం ప్రధాన రహదారిపై కిలోమీటర్ దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్