ధరూర్: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరైన బాసు హనుమంతు

57చూసినవారు
ధరూర్: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరైన బాసు హనుమంతు
ధరూర్ మండలం ద్యాగదొడ్డి గ్రామంలో వాల్మీకి జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు హాజరై, రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ వాల్మీకి నాయకులు కమిటీ సభ్యులు బాసు హనుమంతు నాయుడు ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని కోరారు.

సంబంధిత పోస్ట్