లగచర్ల రైతులకు బెయిల్ మంజూరు కావడం హర్షణీయం: మహబూబ్ నగర్ ఎంపీ

58చూసినవారు
లగచర్ల రైతులకు బెయిల్ మంజూరు కావడం హర్షణీయం: మహబూబ్ నగర్ ఎంపీ
38 రోజుల తర్వాత 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ హర్షనీయమన్నారు. ఇది లగచర్ల రైతుల విజయం అని రేవంత్ సర్కార్ కు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందని, పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లలో ఎంపి అరుణ పర్యటించి బాధితులను కలుస్తానన్నారు. ఇకనైనా రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు.

సంబంధిత పోస్ట్