గుడిసెకు నిప్పు పెట్టిన దుండగులు
ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామ రిజర్వాయర్ సమీపంలో చేపల ప్రై చేసే గుడిసెకు ఆదివారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా దగ్ధం అయింది. దాదాపు రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. చేపల ప్రై కోసం వేసుకున్న గుడిసెను నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని కోరారు.