ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికీ అన్యాయమే: ఎంపీ డీకే అరుణ

70చూసినవారు
ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికీ అన్యాయమే: ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ 523 సర్వే నెంబర్ లో ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికీ అన్యాయమే అని ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోమవారం 523 సర్వే నెంబర్ లోని ఇళ్ల కూల్చివేతల ప్రదేశాన్ని, ఇళ్లను ఆమే పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన వికలాంగులు, నిరుపేద బాధితులను పరామర్శించి ఓదార్చారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని అరుణమ్మ వారికి భరోసాను ఇచ్చారు. స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్