నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఛైర్మన్

552చూసినవారు
మహబూబ్ నగర్ పురపాలక ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వార్డ్ విజిట్ కార్యక్రమంలో భాగంగా 2వ వార్డు ఏనుగొండ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య ఉందని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన నూతనంగా బోరు వేయించి, గురువారం మోర్టార్ ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో రెండవ వార్డు ఇన్చార్జ్ మురళి గౌడ్, సిహెచ్ వెంకటేష్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్