భారతదేశంలో 19 రైల్వే జోన్లు ఉన్నాయి. లక్షలాది మంది రోజూ ప్రయాణం చేస్తున్నారు. అయితే ద.మ.రైల్వేలో ఏసీ, స్లీపర్ కోచ్లలో ప్రయాణించేవారు 27శాతం కాగా.. జనరల్ బోగీల్లో ప్రయాణికుల సంఖ్య ఏకంగా 73 శాతం ఉంటుంది. అయినా వీరికి కేటాయిస్తున్న కోచ్లు ప్యాసింజర్ రైళ్లలో 25 శాతం, సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్లలో 10 శాతం కంటే తక్కువే ఉంటున్నాయి. ఎక్కువ రైళ్లలో ప్రస్తుతం రెండే జనరల్ బోగీలు ఉన్నాయి.