బస్సు బోల్తా.. బాలిక మృతి, 25 మందికి గాయాలు (వీడియో)

593చూసినవారు
రాజస్థాన్‌లోని దౌసాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి జైపూర్ వెళ్తున్న స్లిప్పర్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఘటనలో ఓ బాలిక మృతి చెందగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్