ఈసీ ఎదుట నిరాహార దీక్ష చేపడతా: మమతా బెనర్జీ

41353చూసినవారు
ఈసీ ఎదుట నిరాహార దీక్ష చేపడతా: మమతా బెనర్జీ
రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. బీజేపీ ఆదేశాల మేరకు ముర్షిదాబాద్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ను ఈసీ తొలగించిందని ఆరోపించారు. ఒకవేళ అలర్లు జరిగితే దానికి ఈసీ బాధ్యత వహించాలని, ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరాహార దీక్షకు తాను సిద్ధమని దీదీ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్