రూ.78 వేలు దాటేసిన బంగారం ధర

67చూసినవారు
రూ.78 వేలు దాటేసిన బంగారం ధర
పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా పసిడి ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం మరో రూ.400 పెరిగి రూ.78వేలకు చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ నెలకొనడం, దేశీయంగానూ వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటం పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీపావళికి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్