స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

84చూసినవారు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 150 పెరిగి.. రూ. 71,300 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 160 పెరగడంతో.. రూ. 77,780 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్