మధ్యప్రదేశ్లోని సత్నాలో ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు మరో వ్యక్తి సహాయంతో వృద్దుడిని బైక్పై కూర్చోబెట్టి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి నేరుగా బైక్ను తీసుకెళ్లడంతో అందరూ అవాక్కయ్యారు. అనంతరం ఆ వృద్దుడికి అత్యవసర వైద్యం అందించారు. ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.