సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఐదు ఓవర్లు ముగిసేలోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి వృద్ధిమాన్ సాహా(2).. ఔటవ్వగా, ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12) ఔటయ్యాడు. ఇక ఐదో ఓవర్ చివరి బంతికి డేవిడ్ మిల్లర్ కూడా పెవిలియన్ చేరాడు. అంతకుముందు రెండో ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్లో గిల్ (8) కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోర్ 39/4.