గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువ ఉండాలని కోరారు. పరీక్షల మధ్య తక్కువ విరామం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని.. గ్రూప్-2, గ్రూప్-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం జీవో నం. 46ను రద్దు చేయాలన్నారు.