ఆస్పత్రిలో ఒకరిని చంపడానికి వచ్చి మరొకరి హత్య

54చూసినవారు
ఆస్పత్రిలో ఒకరిని చంపడానికి వచ్చి మరొకరి హత్య
ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. పేషెంట్‌గా ఉన్న ఓ క్రిమినల్‌ను చంపడానికి వచ్చిన వ్యక్తి పొరపాటున మరో రోగిని హత్య చేశాడు. జీబీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ నేరస్థుడిని హత్య చేసేందుకు అతని శత్రువు ప్రణాళికా ప్రకారం హంతకుడిని పంపాడు. హత్యకు ముందురోజే ఆ వార్డులో బెడ్‌పై ఉన్న క్రిమినల్‌ను మరో వార్డులోకి మార్చారు. అది తెలియని హంతకుడు.. ఆ బెడ్‌పై ఉన్న వేరే పేషెంట్‌ను గత రాత్రి కాల్చిచంపాడు. మృతుడిని రియాజుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్