జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా రేషన్‌ షాపులు

57చూసినవారు
జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా రేషన్‌ షాపులు
దేశంలోని రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డీలర్ల ఆదాయం పెంచడం, ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. యూపీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలోని 60 రేషన్ షాపులను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ షాపుల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3,500 ఉత్పత్తులు విక్రయించనున్నారు.

సంబంధిత పోస్ట్