ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: హోంమంత్రి

1072చూసినవారు
ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: హోంమంత్రి
అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని హోంమంత్రి అనిత చెప్పారు. అది గ్యాస్ లీకేజీ వల్ల జరిగిన సంఘటన అని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు కంపెనీ బయట ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబాలను ఆమె పరామర్శించారు.

సంబంధిత పోస్ట్