ఛాయ్ తాగుతూనే కుప్పకూలాడు

85చూసినవారు
ఛాయ్ తాగుతూనే కుప్పకూలాడు
దుకాణంలో ఛాయ్ తాగుతూనే గుండెపోటుకు గురైన ఓ వ్యాపారి మృతి చెందారు. ఈ సంఘటన హైదరాబాద్ శివారు ఆమనగల్లులో వెలుగుచూసింది. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన మహ్మద్ మోహిజ్(50) ఎప్పటిలాగే గురువారం తన కిరణా దుకాణం తెరిచాడు. మధ్యాహ్నాం టీ తాగుతూ ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్య లో కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్