బ్రెజిల్లో ఓ వ్యక్తి తన స్నేహితుడు కానుకగా ఇచ్చిన చేపలను తిని మరణించాడు. మాగ్నో గోమెజ్ 'బబర్ ఫిష్' అనే చేపను వండుకుని తిన్నారు. తిన్న కొద్ది నిమిషాలకే గుండెపోటుతో మాగ్నో విషాదకరంగా మృతి చెందాడు. ఈ చేపలో సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషం ఉందని, తనకు తెలియకుండా తినడం వల్లే అతడి శరీరంలో విషం వ్యాపించి చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.