ఈరోజు (ఫిబ్రవరి 2) శుక్రవారం నుంచి వైజాగ్లో డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇంగ్లండ్తో టీమిండియా రెండోవ టెస్టులో తలపడనుంది. ఉదయం 9.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఆతిథ్య జట్టు తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. మరి ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్లతో
భారత్ ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.