రంగారెడ్డి జిల్లా గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నేత జల్కం రవి ఈ నెల 4న పుట్టిన రోజు వేడుకలు చేసుకొని ఆ ఫొటోస్ తమ గ్రామ వాట్సప్ గ్రూపులో షేర్ చేశాడు. దీనిపై అభ్యంతరం తెలిపిన యువకులు శేషిగారి శివ గౌడ్ (24), గుండెమొని శివ గౌడ్ (29) ఆ ఫొటోస్ డిలీట్ చేసి, అతన్ని గ్రూపులో నుండి రిమూవ్ చేశారు. దీనిపై మాట్లాడేందుకు జల్కం రవి, బీజేవైఏం నేత పల్లె రాజు గౌడ్తో పాటు ఆ యువకులను తన వెంచర్లోని ఆఫీసుకు పిలిచాడు. ఈ విషయంలో మాట మాట పెరిగి జల్కం రవి, పల్లె రాజు గౌడ్ ఆ యువకులపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపినట్లు విచారణలో తేలింది.