ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్లకు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆర్బిఐ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన ఆ రెండు బ్యాంక్లపై భారీ జరిమానా విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్కు రూ.కోటి జరిమానా విధించింది. కస్టమర్ సర్వీస్, అంతర్గత, కార్యాలయ ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా యెస్ బ్యాంక్కు రూ.91 లక్షలు జరిమానా విధించింది.