వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్ లలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ వివరించింది.