టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంగళగిరిలో మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.