ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. 2017లో స్వామినాథన్ డబ్ల్యూహెచ్వోలో చేరారు. 2019లో చీఫ్ సైంటిస్టుగా పదోన్నతి పొందారు. కరోనా సమయంలో ఆమె తన సేవలను అందించారు. 2022 వరకు డబ్ల్యూహెచ్వోలోనే కొనసాగారు.