TG: రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తానని BJP నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మంత్రి కోమటి రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. కిషన్ రెడ్డిని సత్కరించినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కిషన్ రెడ్డిని కోరినట్లు వివరించారు. అభివృద్ధికి సహకరిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.