ఘోరం.. పసికందును నీటిలో ముంచి చంపిన తాత

75చూసినవారు
ఘోరం.. పసికందును నీటిలో ముంచి చంపిన తాత
తాజాగా తమిళనాడులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అరియలూరు జిల్లాకు చెందిన బాలమురుగన్, సంగీత దంపతులకు మగబిడ్డ జన్మించాడు. జూన్ 14న 38 రోజుల పసికందు శవమై కనిపించడంతో.. పోలీసులు జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. చిన్నారిని నీటిలో ముంచి చంపిన చిన్నారి తాత వీరముత్తును అరెస్ట్ చేశారు. అనంతరం జరిపిన విచారణలో ఈ చిన్నారికి అప్పుల బాధ వస్తుందని జ్యోతిష్యం నమ్మిన వీరముత్తు.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్