తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

780చూసినవారు
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం రోజు శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.47 కోట్ల ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్