విద్యుత్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గుడ్న్యూస్ చెప్పింది. నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీలపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. బ్యాటరీ వ్యయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్.ఈవీపై గరిష్ఠంగా రూ.1.2 లక్షలు తగ్గిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటిచింది. దీంతో ఈ మోడల్ ధర రూ.14.49లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో.ఈవీపై రూ.70వేల మేర డిస్కౌంట్ ప్రకటించింది.