పెరూ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం భూమి భారీ కుదుపులకు లోనైంది. రిక్టర్ స్కేల్పై ఆ భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారీ భూకపం తర్వాత వెంటవెంటనే పలు చిన్నచిన్న ప్రకంపనలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.