వికారాబాద్ జిల్లాలోని గుంత బాస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ కెమికల్ జిప్సం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిలో భారీగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఫ్యాక్టరీలో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.