యాదాద్రి ఆల‌య హుండీకి భారీ ఆదాయం

66చూసినవారు
యాదాద్రి ఆల‌య హుండీకి భారీ ఆదాయం
తెలంగాణలో ప్ర‌సిద్ధిగాంచిన పుణ్య‌క్షేత్రం యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి ఆల‌యం. ఈ పుణ్యక్షేత్రం ఆదివారం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడిపోయింది. వీకెండ్ కావ‌డంతో యాదాద్రి ఆల‌యానికి భారీ ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. యాదాద్రి గుట్ట ఆల‌యం శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం భ‌క్తులతో నిండిపోయింది. గత మూడు రోజుల్లో స్వామివారిని 2 లక్షల 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఆలయ ఖజానాకు వివిధ రూపాల్లో రూ.2.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్