హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ఆదాయం

53చూసినవారు
హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ఆదాయం
హైదరాబాద్ మెట్రో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 105% పెరిగినట్లు L&T సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా, 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దీంతో గత ఏడాది నష్టాలు భారీగా తగ్గాయని తెలిపింది. 2022-23లో రూ.1315.99 కోట్లుగా ఉన్న నష్టాలు, 2023-24లో రూ.555.04కోట్లకు తగ్గాయి. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరేళ్లలో నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయి.

సంబంధిత పోస్ట్