సోషల్ మీడియాలో మానవ మృగాలు

66చూసినవారు
సోషల్ మీడియాలో మానవ మృగాలు
సోషల్‌ మీడియాలోని కొన్ని భయంకరమైన మానవ మృగాల నుంచి మన పిల్లలను రక్షించుకోవాలని సాయి ధరమ్ తేజ్ అన్నారు. పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియా క్రూరంగా, అసహ్యంగా, భయానకంగా మారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మానవ మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లల భద్రతపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని హీరో సాయి ధరమ్ తేజ్ కోరారు.

సంబంధిత పోస్ట్