భార్య అలిగి వెళ్లిపోయిందని స్తంభం ఎక్కిన భర్త (వీడియో)

11472చూసినవారు
భార్య అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిందని ఓ భర్త విద్యుత్ స్తంభం ఎక్కాడు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. స్తంభం మీదే కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్