మరోసారి వారందరికీ NEET పరీక్ష

60చూసినవారు
మరోసారి వారందరికీ NEET పరీక్ష
NEET యూజీ పరీక్షల వివాదంపై NTA కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు NTA తెలిపింది. అలాగే వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహిస్తామని.. అలాగే దీనికి సంబంధించిన ఫలితాలను కూడా జూన్ 30 లోపు వెల్లడిస్తామని NTA పేర్కొంది. దీంతో నీట్ యూజీ-2024 కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్