రాహుల్ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఇవాళ లోక్సభలో విరుచుకుపడ్డారు. హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని దేశాన్ని ఎప్పుడూ మరిచిపోదని అన్నారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా.. ఇదేనా మీ సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పరంపర, దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని, హిందువులపై కించపరచడం ఫ్యాషన్గా మారిందని దుయ్యబట్టారు. హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరాచాలని కాంగ్రెస్ యత్నించిందని అన్నారు.